చర్యకు ప్రతి చర్య ఉంటుంది – కేంద్రానికి తలసాని హెచ్చరికలు

-

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కాలేజీలు, ఇళ్ళపై ఐటీ దాడులపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేస్తోంది. ఇవాళ ఉదయం నుంచే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో అలాగే, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేస్తోంది.

అయితే… దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ మాట్లాడుతూ.. కక్ష పూరితంగా కేంద్రం వ్యవహరిస్తోంది..చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని దెబ్బతీయాలనుకోవడం బాధాకరమన్నారు మంత్రి తలసాని. కేంద్రం తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఐటీ దాడులు, ఈడీ దాడులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news