రేపు వరంగల్ సీఎం కేసీఆర్.. కారణమిదే !

-

సీఎం కేసిఆర్ వరంగల్ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 1 నాడు అంటే రేపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా సిఎం కేసిఆర్ శనివారం ఉదయం 9.00 గంటలకు ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ఉదయం 11.15 గంటలకు వరంగల్ ములుగు రోడ్డులోని ప్రతిమ హాస్పిటల్ కు చేరుకుంటారు.

అనంతరం ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరంగల్ నుండి మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారు.

ఇది ఇలా ఉండగా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకోనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గంలోయాదాద్రికి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారు. సిఎం కేసిఆర్ యాదాద్రీ లక్ష్మీ నరసింహ్మాస్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news