గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

-

గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల ఐదవ తేదీ నుండి రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గొర్రెల పంపిణీ రెండవ విడత కార్యక్రమం పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గొర్రెల పంపిణీ చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. అలాగే జూన్ 5వ తేదీన అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news