కమ్మ, వెలమ సంఘాలకు భూముల కేటాయింపుపై హైకోర్టు స్టే

-

కమ్మ, వెలమ సంఘాలకు భూముల కేటాయింపుపై హైకోర్టు స్టే విధించింది.  భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కులాల వారీగా భూముల కేటాయింపును తప్పుపట్టిన హైకోర్టు…  జీవో  సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. ఇది కూడా ఒక విధమైన భూముల కబ్జానే అన్న హైకోర్టు.. సాయి సింధు ఫౌండేషన్‌కు రాయితీ ధరకు భూ కేటాయింపును రద్దు చేసినట్టు గుర్తు చేసింది.

భూముల కేటాయింపుపై విచారణలో భాగంగా… అణగారిన వర్గాలకు ఇస్తే అర్థం చేసుకోవచ్చు కానీ.. బలమైన కుల సంఘాలకు ఎందుకని ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేస్తూ విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది.  కౌంటర్ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి హైకోర్టు అనుమతించింది. 2021లో ఖానామెట్‌లో కమ్మ, వెలమ సంఘాలకు ప్రభుత్వం 5 ఎకరాల చొప్పున భూమి కేటాయించింది.  దీనిని నిరసిస్తూ…  కేయూ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి వేసిన పిల్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ విచారణ చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news