పవన్‌ కళ్యాణ్‌ ది వారాహి కాదు.. అదో లారీ – సీఎం జగన్‌ సెటైర్లు

-

పవన్‌ కళ్యాణ్‌ ది వారాహి కాదు.. అదో లారీ అంటూ సీఎం జగన్‌ సెటైర్లు వేశారు. నాలుగో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌..అనంతరం మాట్లాడారు. పది రోజుల పాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహించాలని పిలుపునిచ్చారు. 42 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌.

రూ.26 వేల కోట్లు ఇప్పటి వరకు ఈ పథకానికి ఇవ్వడం జరిగింది.. ఇదంతా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే లబ్ధిదారులకు నేరుగా అందిందన్నారు.. పిల్లల భవిష్యత్తు కోసం.. బడికి పిల్లలను పంపించేందుకు ఆ తల్లులకు ఇచ్చే ప్రోత్సాహకం ఇదని వివరించారు. మన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో తప్పితే దేశంలో మరెక్కడా జరగటం లేదన్నారు సీఎం జగన్‌.దత్త పుత్రుడు ఈ మధ్య లారీ ఎక్కి వచ్చి ఏదో మాట్లాడుతాడని ఆగ్రహించారు… నోటికీ అదుపు లేదు, బట్టులు చించి కొట్టాలంటాడు… పూనకం వచ్చినట్టు మాట్లాడుతారని నిప్పులు చెరిగారు. రౌడీలా తొడలు కొట్టలేం.. నాలుగేసి పెళ్లిళ్లు చేసుకొని వ్యవస్థ లనూ నాశినం చెయ్యలేమని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news