తెలంగాణకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి కావాలి – వైఎస్ షర్మిల

-

నేడు లోటస్ పాండ్ లో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఈ నెల నాలుగవ తేదీ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు, పది రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు.

ఈ పాదయాత్రకి ప్రతి ఒక్కరూ తన వెంట రావాలన్నారు. ఎన్ని దాడులు చేసినా, కొట్టినా, చంపిన బెదిరేది లేదన్నారు. తెలంగాణకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి కావాలన్నారు వైఎస్ షర్మిల. మనం అధికారంలోకి రావాలని కార్యకర్తలతో అన్నారు. ఆపద సమయంలో తన వెంట ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని అన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news