ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..ఇక వారికి స్నాక్స్, మంచినీటి వసతి

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ ఎండీగా… సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.

అలాగే ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ… ఎండీ సజ్జనార్‌.. ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. దూర ప్రాంత ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. గరుడ ప్లస్, రాజధాని బస్సుల లో ప్రయాణం చేసే ప్రయా ణికుల కోసం వెయిటింగ్ హాల్స్, స్నాక్స్, త్రాగునీటి వసతులు మొదలగునవి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌..తన సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. ఈ వసతు లను తెలంగాణ ప్రయాణి కులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news