కేటీఆర్ హుజూరాబాద్ పర్యటనలో ఉద్రిక్తత..ABVP కార్యకర్తల అరెస్ట్

-

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. కమలాపూర్‌లో రూ.45 కోట్లతో నిర్మించిన మహత్మా జ్యోతిబా పూలే బాలుర, బాలికల గురుకులాలు, కేజీబీవీ పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాల్ని కేటీఆర్‌ ప్రారంభిస్తారు.

అయితే, మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్‌ పర్యటన అడుగు అడుగున నిరసనలతో సాగింది.హెలికాప్టర్ లో కరీంనగర్ చేరుకున్న మంత్రి కి కార్యకర్తలు ఒకేసారి రావడంతో మంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేశారు.కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కు ఎబివిపి నాయకులు అడ్డం రావడంతో బీఆర్ ఎస్ నాయకులు వారి పై దాడి చేశారు..సర్క్యూట్ రెస్ట్ తరువాత బయటకు వస్తున్న సమయంలో కార్యకర్తలు ఒకేసారి మీదికి రావడంతో మంత్రి అసహనం వ్యక్తం చేసాడు.మంత్రి తిరిగి వెళ్లే దారిలో మరోసారి ఎబివిపి కార్యకర్తలు అడ్డుకోవడం తో పోలీసులు వారిని అరెస్టు చేశారు.మంత్రి హెలికాప్టర్ లో కమలాపుర్ బయలు దేరారు.

Read more RELATED
Recommended to you

Latest news