ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు !

-

ఏపీ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు మార్చి 29వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత వారం రోజు నాకు వివరిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఈ సారి పదవ తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లు ఉండటంతో ఏప్రిల్ తొలి వారంలో మొదలుపెట్టి వారంలోని పూర్తి చేయాలని లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఏపీ విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news