BREAKING : సీఎం కేసీఆర్‌తో ఇవాళ పంజాబ్ సీఎం భేటీ..వీటిపైనే చర్చ

-

హైదరాబాద్‌ : ఇవాళ హైదరాబాద్ కు పంజాబ్ సీఎం భగ్వంత్ సింగ్ మాన్ రానున్నారు. హైదరాబాద్‌ లోని తాజ్ కృష్ణాలో ఒక ఇన్వెస్ట్ మెంట్ మీటింగులో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తోన్నారు పంజాబ్ సీఎం భగ్వంత్ మాన్.

అయితే, ఈ సమావేశం కాగానే, నేరుగా ప్రగతి భవన్‌ కు వెళ్లనున్నారు పంజాబ్ సీఎం భగ్వంత్ మాన్. అనంతరం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో లంచ్ భేటీ కానున్నారు పంజాబ్ సీఎం భగ్వంత్ మాన్. ఇక ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర పరిస్థితులు, దేశ రాజకీయాలు, రైతుల సమస్యలపై చర్చ జరుగనుంది. అలాగే, బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం, మీడియా సమావేశం కూడా ఉండే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news