ఆరున్నర లక్షల ఆటోడ్రైవర్ల జీవనోపాధి దెబ్బ తీశారు : కేటీఆర్

-

ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభకు కేటీఆర్‌ ముుఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్‌ ఎంపీలే. మాయమాటలు చెప్పి రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 420 హామిలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. అప్పు తెచ్చుకోండి రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడ ఆ హామీ ఎటుపోయింది?. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. వాటికోసం కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు వేచి చూస్తున్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడ్డారు. కడుపు కాలిన ఆటోడ్రైవర్‌ ప్రజాభవన్‌ ముందు ఆటో కాలబెట్టాడు.

బీఆర్‌ఎస్‌ను పాతిపెడతానని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారు. రేవంత్‌ లాంటి బుడ్డర్‌ ఖాన్‌లను కేసీఆర్‌ ఎంతోమందని చూశారు. ఎంతో మంది తీస్మార్ ఖాన్‎లను మాయం చేసి తెలంగాణ తెచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరికి అన్యాయం జరిగినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వస్తాం. మన బాస్‎లు ఢిల్లీలోనో, గుజరాత్‎లోనో లేరని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news