ఇది ట్రయల్ మాత్రమే.. బిజెపిలో చేరే వారి సంఖ్య చాలా పెద్దది – తరుణ్ చుగ్

-

ఢిల్లీలో బిజెపి తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ తో సమావేశమయ్యారు రాష్ట్ర బిజెపి అద్యక్షుడు బండి సంజయ్, దాసోజు శ్రవణ్. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సంతోషమయిన రోజని అన్నారు. మా విద్యార్థి పరిషత్ లో పనిచేసిన దాసోజు శ్రావణ్ నాతో భేటీ అయ్యారని తెలిపారు తరుణ్ చుగ్. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై బండి సంజయ్,దాసోజు శ్రవణ్ తో చర్చించామన్నారు. తెలంగాణ ను కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు తరుణ్ చుగ్. బండి సంజయ్ నాయకత్వం లో ప్రజా సంగ్రామ యాత్ర, మోటార్ సైకిల్ యాత్రలు నడుస్తున్నాయన్నారు.

ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బండి సంజయ్ ఢిల్లీ వచ్చారని అన్నారు.తెరాస ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ము చేస్తుందన్నారు. శ్రావణ్ పై వేలెత్తి కాంగ్రెస్ నేతలు మాట్లాడలేరని అన్నారు. టీఆరెస్ కు ప్రజలు గుడ్ బై చెప్పనున్నారని.. కేసీఆర్ అధికారం కోల్పోతారని అన్నారు. కేసీఆర్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే చెప్తుందన్నారు. బీజేపీలో చేరే వాళ్ళ సంఖ్య చాలా పెద్దదని.. ఇది ట్రయల్ మాత్రమేనని అన్నారు తరుణ్ చుగ్.

Read more RELATED
Recommended to you

Latest news