ఆన్‌లైన్‌ మోసాల్లో పోగొట్టుకున్న డబ్బు తిరిగి వస్తుందా.? సర్వేలో తేలిన నిజాలు ఇవే..!!

-

ఈరోజుల్లో ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. చదువుకున్నవారు, లేనివారు అని తేడా లేదు.. అందరూ సైబర్‌ నేరగాళ్ల చేతిలో బలైపోతున్నారు. అయితే సైబర్‌ క్రైమ్‌ జరగగానే కంప్లైట్‌ ఇవ్వండి అని పోలీసుులు అంటున్నారు. కానీ ఎంతమందికి డబ్బు వెనక్కు వస్తుంది. కోట్లల్లో డబ్బులను సైబర్‌ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. కానీ తిరిగి ఎంత వస్తున్నాయి. వీటిపై తాజాగా జరిగిన సర్వే ఏం చెప్పిందంటే..

LocalCircles అనే సంస్థ ఓ సర్వే జరిపింది. 42 శాతం మంది భారతీయులు తాము లేదా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు గత మూడేళ్లలో ఆర్థిక మోసానికి బాధితులయ్యారని తేల్చింది. 2021 అక్టోబర్‌లో నిర్వహించిన ఈ సర్వేలో భారతదేశంలోని 301 జిల్లాలకు చెందిన 32,000 మంది పాల్గొన్నారు. వీరిలో 43 శాతం మంది టియర్ 1 నగరాల నుంచి కాగా, టియర్ 2 నుంచి 27 శాతం మంది, మిగతా వారంతా టియర్ 3, 4, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది పౌరులు తమ ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ పిన్ వివరాలను సన్నిహిత కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. 4 శాతం మంది తమ పనివాళ్లతో లేదా తోటి ఉద్యోగులతో పంచుకుంటున్నట్టు తెలిపారు.

33 శాతం మంది తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఏటీఎం పాస్‌‌వర్డ్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌లను ఇమెయిల్ లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకుంటున్నట్టు తేలింది. 11 శాతం మంది ఈ వివరాలను మొబైల్ ఫోన్‌లో సేవ్ చేశామని తెలిపారట. గత మూడేళ్లలో బ్యాంక్ అకౌంట్ మోసాలు, ఇ-కామర్స్ ఆపరేటర్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మోసాలు పెరిగాయని ఈ సర్వేలో తేలింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.60,414 కోట్ల ఆర్థిక మోసాలు జరిగాయి.
మైక్రోసాఫ్ట్ 2021 గ్లోబల్ టెక్ సపోర్ట్ స్కామ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం 2021లో ఆన్‌లైన్ మోసాలు 69 శాతం ఉన్నాయని తేలింది.
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం గత మూడేళ్లలో బ్యాంక్ అకౌంట్ మోసాలు 29 శాతం, ఇ-కామర్స్ మోసాలు 24 శాతం, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మోసాలు 18 శాతం, మొబైల్ యాప్స్ ద్వారా మోసాలు 12 శాతం, ఏటీఎం కార్డు మోసాలు 8 శాతం, ఇన్స్యూరెన్స్ మోసాలు 6 శాతం, ఇతర మోసాలు 21 శాతం జరిగాయని తేలింది.

గత మూడేళ్లలో ఆన్‌లైన్ మోసాలకు గురైన వారిలో కేవలం 17 శాతం మందికే డబ్బులు వెనక్కివచ్చినట్టు తేటతెల్లమైంది. 74 శాతం మందికి సమస్య పరిష్కారం కాలేదు. పౌరులు ఎలాంటి ఆర్థిక మోసాలకు పాల్పడ్డా ఫిర్యాదు చేయాలని ఆర్‌బీఐ కోరుతోంది. కంప్యూటర్, మొబైల్, ఇమెయిల్‌కు కఠినమైన పాస్‌వర్డ్ సెట్ చేయాలని సూచించింది. అలాగే..తరచూ పాస్‌వర్డ్‌లను మార్చుకుంటూ ఉండాలి. మనం ఎక్కడ మర్చిపోతామో అని పాస్‌వర్డ్స్‌ను అలానే పెట్టుకోవద్దని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news