కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్నీళ్లే మిగిలాయి.. హరీశ్ రావు ఫైర్..!

-

మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో అయన పాల్గొన్నారు. వంద రోజులు కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించడం లేదని రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదు.

కరెంట్ లేదు, నీళ్లు లేవు. కన్నీళ్లే మిగిలాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించాలి. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాలి. మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండి. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, వడ్లకు మక్కలకు రూ.500 బోనస్, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులు రూ.15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.

మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పింది కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి. వడ్లు కొనబోమని చెప్పింది బీజేపీ కాదా? కాంగ్రెస్కు అధికారంలోకి వచ్చాక కళు నెతుకెక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news