రేవంత్ రెడ్డి వెంట ఉన్నోళ్ళంతా దొంగలు – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలేనని మండిపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆయన వెంట ఉన్నోల్లంతా దొంగలేనన్నారు. కేసిఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్ కట్టించిన 10 ఇళ్లలో సమానం అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం మాటలు తప్ప..రూపాయి సాయం లేదని ఆరోపించారు.

బాల్కొండలో కట్టిన ప్రతి డబుల్ బెడ్రూం ఇల్లు కేసిఆర్ ఇచ్చిన పైసలతో కట్టిందేనన్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలోఎంత మందికి వచ్చింది..? ఇప్పుడు ఎంత మందికి వస్తుందో..ఎంపి అర్వింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ,కాంగ్రెస్ నాయకులవి అన్ని అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

మోడీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారని అన్నారు. కేసిఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరని ఆరోపించారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద విచారణ చేయాలని పార్లమెంట్లో ప్రతి ఎంపి ప్రశ్నిస్తున్నాడని తెలిపారు. ఎల్ఐసి, ఎస్బిఐ లో ప్రజల డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ…సంబంధం లేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నరని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news