బాగా పనిచేసిన వారికే టికెట్లు – KCR

-

నేడు తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ నేటితో 22 ఏళ్లు పూర్తిచేసుకుని 23వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా రిపోర్ట్ తెప్పించుకున్న కేసీఆర్ అందులో 42 మందిపై వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆ 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారట. ఆ 42 మంది ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసు అని.. కానీ వారి పేర్లను ఇప్పుడు చెప్పదలుచుకోలేదని అన్నారట. బాగా పనిచేసిన వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారట కేసీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారట. మీరు జాగ్రత్తగా పని చేసుకోకపోతే మీకే నష్టమని హెచ్చరించారట కేసీఆర్. ఇక షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news