షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు – సీఎం కేసీఆర్

-

బిఆర్ఎస్ పార్టీ నేటితో 22 ఏళ్లు పూర్తి చేసుకుని 23వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ఈ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. బాగా పని చేసిన వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలని.. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమని హెచ్చరించారు కెసిఆర్. నియోజకవర్గాల వారిగా రిపోర్ట్ తెప్పించుకున్న సీఎం కేసీఆర్.. అందులో 42 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారని సమాచారం. ఈ సమాచారం ఆధారంగా కేసీఆర్ వారికి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news