Breaking : నేడు బిజెపిలో చేరనున్న బూర నర్సయ్య.. ఆయనతో పాటు మరో ముగ్గురు నేతలు !

-

టిఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బూర నర్సయ్య గౌడ్…. ఇవాళ మధ్యాహ్నం బీజేపీ కండువా కప్పుకొని ఉన్నారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

ఆయనతోపాటు మరికొందరికి కీలక నేతలు బిజెపిలోకి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత వడ్డేపల్లి నర్సింగరావు కుమారుడు వడ్డపల్లి రాజేశ్వరరావు తో పాటు మరో ఇద్దరు కీలక నేతలు బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మునుగోలు టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసి… బయటకు వచ్చారు బూర నర్సయ్య గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news