జగిత్యాల పంచాయితీ…జీవన్ రెడ్డి ఇంటికి మధుయాష్కీ !

-

Madhuyashki went to MLC Jeevan Reddy’s house: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్‌ పంచాయితీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్‌ పంచాయితీ తెంపేందుకు రంగంలోకి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి దిగారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి వెళ్లారు. జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి వెళ్లారు.

Madhuyashki went to MLC Jeevan Reddy house

దీంతో జీవన్‌ రెడ్డిని మధుయాష్కి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జీవన్ రెడ్డితో సుదీర్ఘ మంతనాలు చేస్తున్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. అంతేకాదు జీవన్‌ రెడ్డి ఇంట్లో భోజనం కూడా చేస్తున్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాబితాపూర్ లోని గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news