హైదరాబాద్​లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో వెళ్లేవారికి అలర్ట్

-

హైదరాబాద్​లో నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. హుస్సేన్​సాగర్ తీరాన జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం దృష్ట్యా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పలు దారుల్లో వాహనాల రాకపోకలపై అంక్షలు విధించారు. ఈరోజు మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 8 గంటల వరకు అంక్షలు అమల్లో ఉండనున్నాయి.

పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్డు, రోటరీ వైపు వెళ్లే వాహనాలు.. షాదన్ కళాశాల మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.

సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు.. రాణిగంజ్ మీదుగా వెళ్లాలని వివరించారు.3. లక్డీకపూల్​ నుంచి ట్యాంక్​బండ్​, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు.. తెలుగుతల్లి ఫ్లైఓవర్​, లోయర్ ట్యాంక్​బండ్ వైపు మళ్లిస్తామన్నారు.

ట్యాంక్ బండ్, బీఆర్కే భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు.. లక్డీకపూల్​ మీదుగా వెళ్లాలని సూచించారు.

అఫ్జల్​ గంజ్​ నుంచి ట్యాంక్​ బండ్​ మీదుగా సికింద్రాబాద్​ వెళ్లే ఆర్టీసీ బస్సులు.. తెలుగుతల్లి ఫ్లైఓవర్​, కట్ట మైసమ్మ, లోయర్​ ట్యాంక్​బండ్​, డీబీఆర్​ మిల్స్​, కవాడీగూడ మీదగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news