హక్కుల సారథి.. ధీరోదాత్తుడు అంబేడ్కర్‌ : సీఎం కేసీఆర్

-

సమస్త వ్యవస్థల్లో సమాన హక్కుల కోసం ఎంతో పరితపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకున్నారు. రాష్ట్రంలోని సబ్బండ కులాలకు, మహిళలకు, పేద వర్గాలకు అవసరమైన అన్ని రకాల ఆసరాను అందిస్తూ.. అంబేడ్కర్‌ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తితో దేశంలో దళిత, సకల జనుల సంక్షేమానికి తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు.

‘‘కష్టంతో కూడుకున్న ఎంతటి సుదీర్ఘమైన ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే.. గమ్యాన్ని చేరుకోవడం ఖాయమని అంబేడ్కర్‌ చాటిచెప్పారు. ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు ఆయన జీవితమే నిదర్శనం. వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు ఆయన.‘‘ అని కేసీఆర్ అన్నారు.

అందుకే ఈ తెలంగాణ బాంధవుడికి ఘన నివాళిగా..  ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌ నడిబొడ్డున 125 అడుగుల బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మహా విగ్రహాన్ని.. ఆయన జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుండడం యావత్‌ దేశానికే గర్వకారణమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news