విజయసాయి రెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే : షర్మిల

-

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే అని పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. తాజాగా ఆమె ట్విట్టర్ వేదిక గా స్పందించారు. జగన్ మాటలే ఆయన మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ సాయి గారు.. మీరు చదివింది జగన్ స్క్రిప్ట్ కాదని.. ప్రమాణం చేయగలరా..? ఆస్తులు నలుగురు బిడ్డలకు చెందాలని వైఎస్ నిర్ణయించారు. కాదని ఆయన చెప్పగలరా..? ఎవ్వరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఈ వై.ఎస్. బిడ్డకు ఎప్పటికీ రాదని మాట ఇస్తున్నా అంటూ ట్వీట్ చేశారు షర్మిల.

మరో వైపు నిన్న బాబాయ్ వై.వీ. సుబ్బా రెడ్డి పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కంట తడి పెడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు షర్మిల. ముఖ్యంగా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తన మనమళ్లకు ఆస్తి సమానంగా పంచుతానని మాట ఇచ్చారని.. అదే మాట ప్రకారం.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎంఓయూ రాశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news