గుజరాత్ పై ఎందుకు మీకు ఇంత అక్కసు ? : కేటీఆర్ పై విజయశాంతి ఫైర్

-

 

 

గుజరాత్ పై ఎందుకు మీకు ఇంత అక్కసు ? అని కేటీఆర్ పై విజయశాంతి ఫైర్ అయ్యారు. ఎంతో మంది తెలంగాణ బిడ్డలు గుజరాత్‌లో లక్షల సంఖ్యల పనిచేస్తున్నరు కదా ఐటీ మంత్రి కేటీఆర్ గారూ…అంటూ పంచాంగంపై కేటీఆర్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు విజయశాంతి.

పదే పదే ఒక గుజరాత్ పేరు తీసి విమర్శలు చెయ్యడం… అక్కడెక్కడో గుజరాత్‌లో బతుకుతున్న తెలంగాణ ప్రజలకెంత ఇబ్బందికర పరిస్థితి అని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల నుండీ పెట్టుబడుల కోసం ప్రయత్నించే మంత్రిగా మీకు కూడా ఇదెంతవరకూ సమంజసం? అని ప్రశ్నించారు. గుజరాత్ అనే రాష్ట్రంపై ఇంత అక్కసు చూపితే… మీ తండ్రి గారి భారత రాష్ట్ర సమితి ఎట్ల జాతీయ పార్టీ ఐతదో.. కొంత సమంజసంగా మీ పార్టీలో మాట్లాడే ఒకే వ్యక్తిగా మీరే చెప్పాలి అని చురకలు అంటించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news