తెలంగాణలో కబ్జాలపై విజయశాంతి ఫైర్

-

తెలంగాణలో మన చిన్నారుల ఆరోగ్యం కోసం సుమారు 70 ఏళ్ల కిందట హైదరాబాదులో ఏర్పాటు చేయించిన నీలోఫర్ ఆస్పత్రిని కబ్జాసురులు పీడిస్తున్నరు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ చిన్నపిల్లల ఆస్పత్రికి చెందిన ఫోరెన్సీక్ ల్యాబ్ స్థలాన్ని ఆక్రమించేశారన్నారు విజయశాంతి. స్వయంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగంలోకి దిగినా ఆ స్థలాన్ని ఆక్రమించినవారు లెక్కచెయ్యలేదని పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌కి ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో పరిశీలించేందుకు వచ్చిన టౌన్ ప్లానింగ్ ఏసీపీని స్థానిక ఎమ్మెల్యేకి చెందినవాళ్లమంటూ కొందరు ఫోన్ చేసి బెదిరించారు. ఆస్పత్రి పరిసరాల్లోనే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నా ఎవ్వరూ భయపడలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని ఇంత పెద్ద ఆస్పత్రి స్థలాన్ని ఆక్రమించిన కబ్జాకోరులకు జీహెచ్ఎంసీ అధికారులు బెదిరింపులకు గురై భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామంపై మీడియా కోడై కూస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు. భావిపౌరులకు భరోసా ఇవ్వలేని ఈ సర్కారుకు ప్రజలు చెల్లుచీటీ పాడే రోజులు దగ్గరకొస్తున్నాయని నిప్పులు చెరిగారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news