78 సీట్లు గెలిచి..తెలంగాణలో అధికారంలోకి వస్తాం : మాణిక్యం ఠాకూర్

-

నిర్మల్ : రాబోయే తెలంగాణ ఎన్నికలలో డెబ్బై ఎనిమిది సీట్లలో విజయం సాదించి.. అధి కారంలోకి వస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉత్తర తెలంగాణలో అధిక సీట్లను సాదిస్తామన చెప్పారు. కాంగ్రేసు ప్రజలతో అనుభందం ఉన్న పార్టీ..
తెలంగాణ ఏర్పాటు పై బీజేపి డ్రామాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ కు తాళం వేసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని బిజెపి తెలంగాణ ప్రజలను కించపరిచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లో నాటకాలు, డ్రామాలు కుదురవని స్వంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్త లు, ఓటర్లు సరిగా ఉన్నా నేతల మద్య సమన్వయం లేదని ఫైర్ అయ్యారు.

క్రమశిక్షణ ఉల్లంగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని అగ్రహించారు. తెలంగాణ లూటీ ముగియడంతో…బంగారు భారతదేశం మంటూ దేశంలో లూటీకి కోసం వస్తున్నారని సీఎం కేసీఆర్ పై సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news