పదేళ్లు అధికారంలో ఉండి హరీశ్ రావు ఏం చేశాడు : వీ.హెచ్.

-

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తొందర పడుతున్నారు అంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. బీఆర్ఎస్ మూడు ఎకరాల.. డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం అని చెప్పారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావు అని ప్రశ్నించారు. పదేళ్లలో నువ్వు ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేశావు అని మండిపడ్డారు. మేము వచ్చి నెల రోజులు కాలేదా.. మేము ఇచ్చిన మాట ప్రకారం.. అమలు చేస్తామని తొందర పడకూడదన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామన్నారు.

ఆరు గ్యారెంటీలు అమలుకు సీఎం  కృషి చేస్తున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అండర్ 18 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ కి రావాలని కోరామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు.. బీఆర్ఎస్ ఫెయిల్యూర్ ని జనంలోకి రేవంత్ బాగా తీసుకెళ్లారని తెలిపారు. అన్ని హామీలు అమలు చేస్తామని.. ప్రజలు నమ్మండి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు. ఏపీలో షర్మిల వస్తున్నారని ఇక్కడ వద్దు. అక్కడికీ వెళ్లు అని మొదటి నుంచి చెప్పినామన్నారు. వైజాగ్ లో అమ్మాయి పై జరిగిన అఘాయిత్యం పై షర్మిల పోరాటం మొదలు పెట్టాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news