కేటీఆర్ ట్వీట్ లో ఆంతర్యమేమిటో: రఘునందన్ రావు

-

విపక్షాలపై రాజకీయ దురుద్దేశాలతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని, మరి ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ నేతలు ఎంత మంది పై ఐటి దాడులు జరిగాయని ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై బీజేపీ నేత, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు.

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదేనేమో అంటూ రఘునందన్ రావు సెటైరికల్ ట్వీట్ సంధించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులపై కేటీఆర్ శనివారం ఉదయం ట్వీట్ చేస్తే… దానిపై రఘునందన్ రావు మధ్యాహ్నం స్పందించారు. కేటీఆర్ ట్వీట్ లోని ఆంతర్యమేమిటోనంటూ ప్రశ్నించిన రఘునందన్ రావు.. దర్యాప్తు సంస్థలు అంటే ఎందుకు ఉలికిపడుతున్నారో అర్థం కావడం లేదని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news