పంటల సాగు వివరాలు తెలియని మీరు రైతులకు ఏం సేవ చేస్తారు – మంత్రి హరీష్ రావు

-

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా మొగుడంపల్లి మండల్ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. మండల కేంద్రంలో సెంట్రల్ డివైడర్ సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొగుడంపల్లి మండలానికి సంబంధించిన పంటల సాగు వివరాలు చెప్పాలని అధికారులను ప్రశ్నించారు.

మంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో జహీరాబాద్ ఏడిఏ బిక్షపతి, మున్నాపూర్ ఏఈఓో తడబడ్డారు. దీంతో అధికారుల తీరుపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎంత మేర పంటలు సాగు చేస్తున్నారో తెలియకుండా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వచ్చే ముందు అన్ని శాఖల వివరాలను తాను సమగ్రంగా తెలుసుకుంటానని తెలిపారు. వ్యవసాయ అధికారుల తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ శరత్ ను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news