కొత్త సచివాలయంలో మంత్రులు ఏయే ఫైళ్లపై తొలి సంతకాలు చేశారంటే..?

-

తెలంగాణలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన సీఎం ఛాంబర్ లో ఆశీనులైన కేసీఆర్ 6 ఫైళ్లపై సంతకం చేశారు. ఇక ఆ తర్వాత మంత్రులు తమ ఛాంబర్లలో అశీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. ఇప్పటి వరకు మంత్రులు ఏయే ఫైళ్లపై తొలి సంతకాలు చేశారంటే..?

* గృహ లక్ష్మి , పోడు భూముల పంపిణీపై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు.

* డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై కేటీఆర్ తొలి సంతకం చేశారు.

* కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరుపై హోమ్ మంత్రి మహమూద్ అలీ సంతకం చేశారు.

* జంటనగరాల్లోని హిందూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాల ఫైల్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతకం చేశారు.

* శ్రమ శక్తి అవార్డుల ఫైలు పై మల్లారెడ్డి సంతకం చేశారు.

* అంగన్ వాడీలకు సన్నబియ్యం పంపిణీపై మంత్రి గంగుల కమలాకర్ సంతకం చేశారు.

* రెండో విడత దళిత బంధు పధకం ఫైలు ఫై సంతకం చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

* సీతారామ ప్రాజెక్టు ఫైల్ పై మంత్రి తన్నీరు హరీష్ రావు తొలి సంతకం చేశారు.

* చెక్ డ్యామ్ ల నిర్మాణం ఫైలు పై మంత్రి నిరంజన్ రెడ్డి సంతకం చేశారు.

* కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలు పై మంత్రి ఎర్రబెల్లి తొలి సంతకం చేశారు.

* అంగన్ వాడీ కేంద్రాల్లో ఒకటి నుండి మూడు సంవత్సరాల మధ్య ఉన్న చంటి పిల్లలకు ఉచితంగా పాలు పంపిణీ ఫైలు పై మంత్రి సత్యవతి రాథోడ్ సంతకం చేశారు.

* ఉచిత చేప పిల్లల పంపిణీ ఫైలు పై మంత్రి తలసాని తొలి సంతకం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news