జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది – మాజీమంత్రి జవహర్

-

తూర్పుగదావరిజిల్లా: రాజమండ్రి సిఐడి కార్యాలయంలో ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను పరామర్శించారు మాజీ మంత్రి జవహార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే భర్త వాసు, అతని మామ అప్పారావుని అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు. ఈ అరెస్ట్ ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జవహర్.

జరగబోయే మహానాడు పండుగని అడ్డుపెట్టుకొని నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు. వేధించి భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆదిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని నిర్బంధం చేయడమేనన్నారు జవహర్. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే స్థానిక సిఐడి అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news