ఇబ్రహీంపట్నంలో మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం అరికట్టలేకపోతున్నారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు మృగాళ్లు ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులపై రోజురోజుకు కీచకుల ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. మాయమాటలు చెప్పి.. సరిగ్గా లోకం తెలియని బాలికలను గర్భవతులను చేస్తున్నారు. తాజాగా ఇలాంటి అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది.

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంత కాలంగా ఆమెను భయపెడుతూ కప్పాటి స్వామి(21) అనే యువకుడు ఆమెపై పలు మార్లు అఘాయిత్యం చేశాడు. ఇంట్లో ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడిన బాలిక ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉంది.

కొద్దిరోజుల తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యుడు ఆ బాలిక గర్భవతి అని ధ్రువీకరించాడు. కంగుతిన్న తల్లిదండ్రులు ఏమైందని బాలికను అడగగా.. ఆమె అసలు విషయం చెప్పింది. కోపోద్రిక్తులైన బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు స్వామిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news