కుంభకోణాలకు ఫాదర్ KCR – షర్మిల

-

 

కుంభకోణాలకు ఫాదర్ KCR అంటూ మరోసారి ఫైర్ అయ్యారు వైయస్ షర్మిల. ఒకే సంస్థకు ప్రాజెక్టులు కట్టబెట్టి కమీషన్లు దోచుకున్నాడు. ధరణి పోర్టల్ తో ఎక్కడికక్కడ భూములు కబ్జాలు పెట్టాడనినిప్పులు చెరిగారు.

 

స్కూటర్ నడిపే కేసీఆర్.. అక్రమ సంపాదనతో విమానం కొనే స్థాయికి ఎదిగాడు. ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు మోపుతున్నాడన్నారు. మహారాష్ట్ర పాపడం కథ చెప్పి, మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని నమ్మించిన కేసీఆర్.. ఓట్ల తర్వాత నట్టేట ముంచాడు. మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు అప్పగించి, కల్తీ లేని కారం, కల్తీ లేని పసుపు తయారు చేసి, రేషన్ ద్వారా పంపిణీ చేస్తామని చెప్పి, నిండా ముంచాడని ఆగ్రహించారు షర్మిల.

 

సంక్షేమమంటే వైయస్ఆర్ గారిదే. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునే పథకాలను రూపొందించారు. తనను నమ్ముకున్న జనం చిరునవ్వుతో జీవించాలని చివరి వరకు కోరుకున్న మహనీయుడు ఆయన. తెలంగాణలో వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడం YSR తెలంగాణ పార్టీకే సాధ్యం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news