తెలుగు అకాడమీ కేసులో మరో ట్విస్ట్.. రూ. 80 లక్షలు కాల్చేశారట !

-

తెలుగు అకాడమీ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ స్కాం లో నిందితులు కాజేసిన రూ. 64 కోట్ల నిధులకు సంబందించి వివరాలు రాబడుతున్నారు సీసీఎస్ పోలీసులు. ఇక ఇప్పటికే ఈ కేసులో 9 మంది నిందితులను కస్టడీకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు.. నిందితులు చెబుతున్న సమాధానాలకు గందర గోళంలోపడుతున్నారు. అకాడమీ అధికారులు ఫిర్యాదు చేశారనే భయంతో రూ. 80 లక్షలు కాల్చేశానoటూ కట్టుకథ అల్లారు నిందితులు.

నిందితులoదరూ పోలీసులకు ఒక్కో రకమైన కథ చెబుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. తాను తీసుకున్న అప్పులన్నీ చెల్లించాలని పోలీసులకు ఓ నిందితుడు చెప్పగా…
ఒక స్నేహితుడికి రూ.50 లక్షలు అప్పు ఇచ్చానని అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని మరో నిందితుడు చెబుతున్నాడట. ఇక ప్రస్తుతానికైతే… కాజేసిన అకాడమీ నిధులతో నిందితులు కొనుగోలు చేసిన ప్లాట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Ubi ,కెనరా బ్యాంకు మేనేజర్లు మస్తాన్వలి, సాధన కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలు, రూ. 20 కోట్లకు పైగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు సీపీఎస్‌ పోలీసులు. ఇక కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news