కుప్పంలో ‘ఎన్టీఆర్’ చిచ్చు…ప్లాన్ ఎవరిది?

-

తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ విషయంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీకి దూరమవుతూనే ఉన్నారు. అలాగే టీడీపీ పగ్గాలు తారక్‌కు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతూనే వస్తుంది. తాజాగా కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో సందడి చేశారు. సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు. బాబులకే బాబు తారక్ బాబు అంటూ నినదిస్తూ…కుప్పంలో చంద్రబాబుకు మరొక తలనొప్పి తీసుకొచ్చారు.

TDP Party | తెలుగుదేశం పార్టీ
TDP Party | తెలుగుదేశం పార్టీ

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలనే డిమాండ్ పెరుగుతూ వస్తుంది. చంద్రబాబుకు వయసు మీద పడిందని, లోకేష్‌కు పార్టీ నడిపే సత్తా లేదని, కాబట్టి ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో అటు టీడీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇటు వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు.

ఇక వైసీపీకి సపోర్ట్‌గా ఉన్నవారే టీడీపీని ఇబ్బంది పెట్టడానికి ఎన్టీఆర్ పేరుని అడ్డం పెట్టుకుని హడావిడి చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. ఇదే సమయంలో ఇటీవల భువనేశ్వరి విషయంలో ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు ఘాటుగానే స్పందించారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య లాంటి వారు ఎన్టీఆర్‌పై డైరక్ట్‌గా విమర్శలు చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అంతే ధీటుగా టీడీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఎన్టీఆర్‌ని ఏమన్నా అంటే ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కుప్పంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్…బాబుకు కౌంటర్ ఇవ్వాలని చెప్పి…సీఎం ఎన్టీఆర్ అంటూ నినదించారు. అయితే అలా చేసింది వైసీపీ శ్రేణులని, వారి ట్రాప్‌లో టీడీపీ శ్రేణులు పడి ఎన్టీఆర్‌పై విమర్శలు చేయొద్దని పలువురు తెలుగు తమ్ముళ్ళు సమస్యని సద్దుమణిగేలా చేస్తున్నారు. మరి టీడీపీలో ఎన్టీఆర్ మ్యాటర్ ఎప్పుడు ఆగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news