బ్రేకింగ్ : బండి సంజయ్ నల్గొండ పర్యటనలో ఉద్రిక్తత… గో బ్యాక్ అంటూ నినాదాలు !

-

గత వారం రోజుల నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీల మధ్య.. ధాన్యం కొనుగోలు అంశంపై తీవ్ర వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేంద్రంపై టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంటే… రాష్ట్ర బీజేపీ మాత్రం టిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నల్గొండ జిల్లాలో పర్యటించారు.

bandi-sanjay
bandi-sanjay

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో మహా తేజ మిల్లు వద్దకు భారీగా చేరుకున్నారు బీజేపీ కార్యకర్తలు. అయితే బండి సంజయ్ పర్యటన ను అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు ఆధ్వర్యంలో మిల్లు వద్దకు భారీగా చేరుకున్నారు టిఆర్ఎస్ కార్యకర్తలు.

దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీ నాయకులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. అంతే కాదు బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నల్ల జెండాలతో టీఆరెస్ నాయకుల ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అక్కడే పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news