కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..!!

-

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సోమవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గద్దగుండు తండా 161 జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు.

Accident
Accident

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఇద్దరు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి గ్రామస్తులుగా గుర్తించారు. మరొక వ్యక్తి కంగ్టి మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, ముగ్గురు వ్యక్తులు ఒకే సారి దుర్మరణం చెందటంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news