కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తలసాని శ్రీనివాస్ ఆగ్రహం

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫామ్ హౌస్ కేసుతో సంబంధం లేదని ఇప్పుడు ఎందుకు సంబరపడిపోతున్నారు? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తుందన్నారు తలసాని శ్రీనివాస్. దర్యాప్తు సంస్థలపై బీజేపీ నేతలకు చిన్న చూపు ఎందుకని అన్నారు.

సిట్ నుంచి సిబిఐ కి బదిలీ చేస్తే ఇక కేసు లేనట్టే అనే విధంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో, ఏ పనులు చేశారో చెప్పాలని నిలదీశారు. కనీసం ఆయన సికింద్రాబాదుకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజలు ఆయనని ఎన్నుకున్నది రాజకీయ విమర్శలు చేయడానికేనా? అని ప్రశ్నించారు. ఏది పడితే అది మాట్లాడవద్దని.. తన జీవితంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కడా చూడలేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news