దిల్ రాజు వారిసు తో హిట్ కొట్టాడా! తమన్, వంశీ కన్నీళ్లు.!

-

ఇక దిల్ రాజు  హీరో విజయ్ నటిచిన  వారీసు సినిమా ఈ రోజు తమిళనాడు లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా కోసం దిల్ రాజు 250 కోట్లు పెట్టి మరీ భారీ ఎత్తున తీశారు.ఇక వారసుడును తెలుగు లో  ముందుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా తెర వెనుక మంత్రాంగం నడిచి 14 కు వాయిదా పడింది.కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి  వాల్తేరు వీరయ్య  సినిమా అలాగే  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా లు ఉండటం వల్ల వెనక్కి వెళ్ళింది.

కాని తమిళంలో ఈ రోజు రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. దిల్ రాజు తో పాటు సినిమా యూనిట్ సిబ్బంది చెన్నై లో  ఓ థియేటర్ లో సినిమా చూస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఉత్సాహం.. అభిమానం.. వరిసు చిత్రానికి అభిమాను నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి థియేటర్లలో బాగా ఎమోషనల్ గా అయ్యారు.

ఫ్యాన్స్ రెస్పాన్స్ చూసిన థమన్ ఎమోషన్ తో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. వీరిద్దరిని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దిగ్గజ నిర్మాత రామానాయడు లా దిల్ రాజు కూడా అన్ని భాషలలో అందరి స్టార్స్ తో సినిమాలు తీయడానికి నడుం కట్టారు. ఇందులో తమిళంలో వేసిన మొదటి అడుగు తో హిట్ కొట్టారని తమిళ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తెలుగు లో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news