చదువుకున్న ఆసుపత్రి కోసం.. ఉన్న ఆస్తినంతా త్యాగం చేసిన వైద్యురాలు..!!

-

చదువుకున్న పాఠశాలకు విరాళం ఇవ్వడం లేకుంటే బిల్డింగ్‌ కట్టించడం, ఫర్నీచర్‌ ఇవ్వడం మనం చూస్తుంటాం.. కానీ తాను చదువుకున్న ఆసుపత్రికి ఓ డాక్టర్‌ ఏకంగా తన ఆస్తిని అంతా రాసిచ్చేసింది.. వైద్య విద్యను అభ్యసించిన ఆసుపత్రి కోసం ఉన్న ఆస్తిని మొత్తం త్యాగం చేయడం అనేది చిన్న విషయం కాదు.. ఆ ఆసుపత్రి ఏదో కాదు.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా మొత్తం ఎందుకు ఇచ్చేసింది..?

48 సంవ‌త్స‌రాలు కష్టపడి కూడ బెట్టిన తన ఆస్తి మెత్తాన్ని దానం చేశారు గుంటూరుకు చెందిన మ‌హిళ‌. ఆమె వృత్తి రీత్యా వైద్యురాలు. వార‌సులు లేక‌పోవ‌టం, భర్త మూడేళ్ల కిందట మృతి చెందటంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తిని గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి దానం చేయాల‌ని డిసైడ్ అయ్యారట. మొత్తం రూ.20 కోట్ల ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారామే…

గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలి్‌స్టగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో 1965వ సంవ‌త్స‌రంలో మెడిసిన్ విద్య‌ను అభ్య‌సించారు. ఆ త‌రువాత ఉన్నత విద్య పూర్తి చేసి 45 సంవ‌త్స‌రాల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

ఇటీవ‌ల‌ డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ సమావేశాల్లో పాల్గొన్న‌ ఉమ, తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని తెలిపారు. ఆస్తిలో కొంత వాట‌ను దానం చేయ‌టం అమెరికాలో ప‌రిపాటిగా జ‌రుగుతుంటుంది కాని తన మెత్తం ఆస్తిని కూడ ఉమ ఉదారంగా దానం చేయడమే ఇక్కడ హైలెట్…చేతి ఖ‌ర్చుల‌కు కూడ దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని ఆమె ఆసుప‌త్రికి ఇస్తున్న‌ట్లుగా వెల్లడించారు.

ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు తెలిపారు..ఇందుకు ఆమె నిరాక‌రించ‌టంతో, ఉమ భర్త.. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరు ఈ బ్లాక్‌కు పెట్టాలనుకున్నారు…డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎన‌స్టీషియ‌న్‌గా విధులు నిర్వ‌ర్తించి, మూడేళ్ల కిందట మృతి చెందారు.

మిగిలిన వారు కూడ త‌మ వంతుగా…

జింకానా రీ యూనియన్‌ సమావేశాల్లో డాక్టర్‌ ఉమ అందించిన స్ఫూర్తితో ఇతర వైద్యులు కూడ త‌మ వంతుగా స‌హ‌కారాన్ని అందించాలనుకున్నారు. డాక్టర్‌ మొవ్వా వెంకటేశ్వర్లు తన వంతుగా రూ.20 కోట్లు ,డాక్టర్‌ సూరపనేని కృష్ణప్రసాద్‌, షీలా దంపతులు రూ.8 కోట్లు, తేళ్ల నళిని, వెంకట్‌ దంపతులు రూ.8 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.

ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనిపిస్తుంది కదా..! ఎక్కడో సినిమాల్లో కథల్లో విని ఉంటాం..చేతిలో రూపాయి కూడా ఉంచుకోకుండా దానం చేయడం గురించి..ఉమ అది చేసి చూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news