అందుకే పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపాము – చంద్రబాబు

-

నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంటలనును పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి పొలాలను చంద్రబాబు పరిశీలించారు. పంట నష్టం పై రైతుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం జగన్ సర్కారుకు లేనే లేదని తప్పుపట్టారు.

వరద ప్రాంతాలలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలు గానీ అధికారులుగానీ పర్యటించలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెట్టడం పట్ల ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలిపామని పేర్కొన్నారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సిబిఐ విచారణకు వద్దని ఆనాడే జగన్ అన్నారని గుర్తు చేశారు. వివేక కుమార్తె సునీత వాదన నిజమని సీబీఐ అఫిడవిట్ వేసిందని చంద్రబాబుు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news