హైదరాబాద్ లో కలకలం.. ప్రియురాలిని చంపిన ప్రియుడు !

-

హైదరాబాద్‌ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. ఆత్మహత్య యత్నం చేసింది ఓ ప్రేమ జంట. ఈ ఘటన లో ప్రియురాలు మృతి చెందింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఒంగోలు కు చెందిన నాగ చైతన్య , కోటి రెడ్డి ఇద్దరూ గత కొన్ని రోజుల ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తుంది నాగ చైతన్య. అలాగే… మెడికల్ రెప్రజెంటేటివ్ గా కోటి రెడ్డి పని చేస్తున్నారు.

crime

అయితే… ఇద్దరి కులాలు వేరు కావడం తో వీరి పెళ్లికి నిరాకరించారు పెద్దలు. దీంతో సుసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఈ ప్రేమ జంట. ఈ నేపథ్యంలోనే… చందా నగర్ లో లాడ్జ్ తీసుకుంది ఈ ప్రేమ జంట. ఈ తరుణంలోని ప్రియరాలిని హత్య చేశాడు కోటి రెడ్డి. ఆ తర్వాత లాడ్జ్ నుండి అదృశ్యమయ్యాడు కోటి రెడ్డి. కట్ చేస్తే ఒంగోలు లో ప్రత్యేకమయ్యాడు కోటి రెడ్డి. ఒంటి నిండా గాయాలతో ఒంగోలు లో హాస్పిటల్ లో చేరాడు కోటి రెడ్డి.

దీంతో చందా నగర్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. అటు ఒంగోలు లో చికిత్స పొందుతున్న కోటి రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఇద్దరు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులకు చెబుతున్నాడు కోటి రెడ్డి. అయితే.. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news