పాతికేళ్లకే జడ్జి అయిన దినసరి కూలీ కూతురు..!!

-

చదువుతోనే మన జీవితాన్ని మార్చుకోవచ్చు.. ఈరోజు మన స్థితి బాలేకపోవచ్చు..కానీ చదువే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.. గొప్ప వాళ్లంతా చెప్పే మాట ఇది.. మాటలకు మాత్రమే పరిమితం కాలేదు.. ఎంతోమంది నిజం చేసి చూపించారు..ఓ దినసరి కూలీ కూతురు జడ్జి అయింది.. అది కూడా.. 25 ఏళ్లకే.. పేదరికం తన కలలకు అడ్డుకాదని నిరూపించి కేవలం 25 ఏళ్లకే న్యాయమూర్తి అయ్యిన ఓ నిరుపేద కూతురు ‘గాయత్రి కథ ఎంతోమందికి స్పూర్తిదాయకం..
కర్ణాటకకు చెందిన ఎన్.గాయత్రి పాతికేళ్ల వయసుకే కర్ణాటకలోని కోలారు సివిల్‌ కోర్టు న్యాయమూర్తి అయింది.. గాయత్రి కష్టం వెనుక ఆమె పట్టుదల ఉంది. పేదరికంలో పుట్టినా కష్టపడి చదివి న్యాయమూర్తిగా అవకాశాన్ని దక్కించుకుంది గాయత్రి. కర్ణాటకలోని బంగారుపేట యళబుర్గికి చెందిన గాయత్రి.. ఎన్‌.కారహళ్లిలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. కోలారు ఉమెన్స్ కాలేజీలో బీకాం పూర్తి చేసిన గాయత్రి.. కేజీఎఫ్‌లోని కెంగల్‌ హనుమంతయ్య కాలేజీలో 2021లో లా పూర్తి చేసింది.

మొదటి ప్రయత్నం విఫలం..

యూనివర్శిటీలో నాలుగో ర్యాంకు సాధించింది. అదే సంవత్సరం సివిల్‌ జడ్జి పోస్టులకు నిర్వహించిన డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ ఫెయిల్ అయ్యింది. రెండోసారి ప్రయత్నించింది.. ఫలితం సాధించింది.

తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలే..

బంగారపేటకు చెందిన నారాయణస్వామి, వెంకట రత్నమ్మల ఏకైక కుమార్తె గాయత్రి. గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరూ రోజువారి కూలీలే.. రెక్కాడితేగానీ.. డొక్కాడని పరిస్థితి.. పనులకు వెళ్లి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతోనో కూతుర్ని చదివించారు. తమలాగే తమ ఒక్కగానొక్క కూతురు కష్టపడకూడదని తపన పడ్డారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి చదివింది..
కూతున్ని ఉన్నతస్థానంలో చూడాలనుకున్న కన్నవారి కోరికను నెరవేర్చింది. న్యాయమూర్తిగా అవకాశాన్ని దక్కించుకుని.. సీనియరు న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం వద్ద ఆమె జూనియర్‌ న్యాయవాదిగా పనిచేసింది. ఆమెలో ఉన్న ప్రతిభ, పట్టుదల గమనించిన న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం సివిల్‌ న్యాయమూర్తి పరీక్షలకు హాజరు కావటానికి చదవాల్సిన పుస్తకాలను ఇచ్చి ప్రోత్సహించారు. ఆమెకు అన్ని రకాలుగాను సహకరించారు. అలా సుబ్రహ్మణ్యం నమ్మకాన్ని.. తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తూ 25 ఏళ్లకే సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులైంది. ఓ సాధారణ దినసరి కూలి కూతురు న్యాయమూర్తి అవడంతో ఈ వార్త సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుంది..
చదువుకోవాలని తపన ఉంటే చాలు.. ఎంత కష్టంలో ఉన్నా..లక్ష్యాన్ని వదిలిపెట్టకుట్టకుండా..మీ గమ్యం దిశగా అడుగేలిసినప్పుడే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగగలుతాం..!

Read more RELATED
Recommended to you

Latest news