నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి : కేటీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. గ్రూప్-2 పోస్టుల పెంపు, జీవో 46 రద్దుతో పాటు నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో అమరణ నిరహార దీక్ష చేస్తోన్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.

అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తోన్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు నేడు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాంధీ ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గాంధీలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news