వరద పోయింది కానీ.. అది మాత్రం ఇంకా మిగిలే ఉంది..!

-

ఇటీవల నివర్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నో ప్రాంతాలలో భారీగా వర్షాలు కురవడంతో ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొన్ని కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆయా ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కడపలోని 10 కాలనీలు వాగు ముంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మాణం లో ఎన్నో ఏళ్ల నుంచి కాలనీవాసులు అధికారులను అడుగుతున్నప్పటికీ జాప్యం చేస్తూ వస్తున్నారు. అయితే తుఫాను ప్రభావం కారణంగా వచ్చిన వరద తీవ్ర ప్రభావం చూపగా ప్రస్తుతం వరదనీరు వెళ్ళిపోయింది కానీ చుట్టూ పేరుకుపోయిన బురద మాత్రం ఇంకా స్థానికులకు ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. దీంతో బురద కారణంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news