జ్యోతిషుడు చెప్పాడని ప్రియుడ్ని చంపిన ప్రియురాలు !

-

కేరళలో దారుణంలో జరిగింది. జ్యోతిషుడు చెప్పాడనీ ప్రియుడ్ని చంపింది ఓ ప్రియురాలు. దీంతో తిరువనంతపురంలో ఈ యువకుడికి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, పరసాలాకు చెందిన షరోన్‌ రాజ్‌, తమిళనాడుకు చెందిన గ్రీష్మా రెండెళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. మధ్యలో వచ్చిన గొడవల నేపధ్యంలో షరోన్ దూరంగా పెట్టంది గ్రీష్మా. ఈ నేపథ్యంలోనే.. గ్రీష్మాకు మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్‌ చేసి.. ఎంగేజ్‌మెంట్‌ చేశారు కుటుంబ సభ్యులు.

పెళ్లి సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ సమయంలో జ్యోతిష్యుడు వద్ద జాతకం చూపించింది గ్రీష్మా. మొదటి భర్త చనిపోయాడని జ్యోతిష్యుడు చెప్పడంతో ప్లాన్ మార్చారు గ్రీష్మా, ఆమె కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే.. ప్రేమించి షరోన్ తో మళ్ళీ మాటలు కలిపి కన్యాకుమారిలో ఇంటికి రమ్మించింది గ్రీష్మా.

ఇంటికి వచ్చిన షరోన్ ను వారి సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకుంది గ్రీష్మా. ఇంటిలో తన స్నేహితులతో కలసి కూల్ డ్రింక్ తాగే పోటి పేరుతో ఆయుర్వేదిక్ డ్రింక్ లో విషం కలిపింది ప్రియురాలు. ఆ తర్వాత 14 రోజులు పాటు ఒక్కో అవయవం పనిచేయకుండా పోయి చనిపోయాడు ప్రియుడు షరోన్. అయితే.. షరోన్ తల్లితండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది ఈ హత్య కేసు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news