రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్, CM KCR

-

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ కు చేరున్న ఆమె… అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ కు వెళతారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో హెలికాప్టర్ లో గచ్చిబౌలి స్టేడియానికి రాష్ట్రపతి చేరుకుంటారు. ఇండోర్ స్టేడియం లో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125 ఉత్సవాల జయంతి ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఇక రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆమె పర్యటిస్తున్న ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news