మీడియాను ఎందుకు రానీయడం లేదు, హైకోర్ట్ ఫైర్

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వస్తున్నాయి. 30 కౌంటింగ్ సెంటర్లలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ పలు కౌంటింగ్ సెంటర్ల వద్దకు మీడియాను అనుమతించకపోవడం విమర్శలకు దారి తీసింది.

కౌంటింగ్‌ కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంతో రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతి ఇవ్వాలని ప్రతినిధులు ఆందోళనకు దిగడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని పలువురు మీడియా ప్రతినిధులు హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళగా దీనిపై తక్షణ విచారణ జరిపిన కోర్ట్ మీడియాను అనుమతించాలి అని జీహెచ్ఎంసీ కమిషనర్‌ ‌కు తెలంగాణా హైకోర్ట్ కాసేపటి క్రితం ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news