జూబ్లీహిల్స్ లో దారుణ హత్య.. రెండో భార్యను చంపి డ్రమ్ములో కుక్కిన పెనిమిటి!

-

దారుణ ఘటనలకు కేరాఫ్‌గా జూబ్లీహిల్స్ నిలుస్తోంది. ఇటీవల కాలంలో ఎక్కువగా హత్య కేసులు, అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా చంపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరగడంతో.. డెడ్ బాడీ నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

క్రైమ్
క్రైమ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ లోని ఎస్‌పీఆర్ హిల్స్‌ లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ మేరకు భర్త తన రెండో భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం తన భార్య మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి.. దానిపై దుస్తులు కప్పి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల క్రితమే చంపి ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. కాగా, 2020లోనే నిందితుడు తన మొదటి భార్యను హతమార్చాడని పోలీసులు పేర్కొన్నారు. రెండో భార్యను ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news