పెన్ను పోయిందని కేసు పెట్టిన ఎంపీ.. ధర లక్షన్నరకు పైనే

-

తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన పెన్ను పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంత చిన్న పెన్ను కోసం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా.. ఆ పెన్ను విలువ అక్షరాల లక్షా యాభై వేల రూపాయలని, అది తన తండ్రి జ్ఞాపకార్థం ఇచ్చిన కలమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఎన్నికల్లో మద్దతు కోరేందుకు చెన్నై వచ్చారు.

ఈ సందర్భంగా గిండీ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో స్వాగతం పలికిన సమయంలో ఆ పేరు ఎవరో దొంగిలించారని పేర్కొన్నారు. ఆ పెన్ను ను తన తండ్రి తనకు బహుమతిగా ఇచ్చారని, కాబట్టి అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఎంపీ విజయ్ వసంత్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version