ఎమ్మెల్యే సంజయ్ వేదిస్తున్నారంటూ మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా

-

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి రాజీనామా చేశారు. నిన్నటిదాకా ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు భోగ శ్రావణి కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడతామని బెదిరించారు. 23 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేక కూడా ఇచ్చారు. కానీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అవిశ్వాసాలు కూడదని అధిష్టానం వారించింది. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఈరోజు భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

బోగ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దొర అని మాట్లాడిన శ్రావణి.. ఎంతో నరక వేదన అనుభవించానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు తాళలేక రాజీనామా చేస్తున్నానని సంచలన ఆరోపణలు చేశారు. తనకి పదవి దక్కేందుకు కారణమైన సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కవిత, కేటీఆర్ కి శ్రావణి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news